ETV Bharat / international

చైనా 'కరోనా వ్యాక్సిన్'​​ విడుదల.. తక్షణమే వినియోగంలోకి!

కరోనా వ్యాక్సిన్ విడుదలపై ఇటీవల రష్యా ప్రకటన చేసిన తర్వాత.. తాజాగా చైనా కూడా టీకా విడుదల చేసినట్లు ప్రకటించింది. వ్యాక్సిన్​​ తక్షణ వినియోగానికి చైనా ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు గ్లోబల్​ టైమ్స్​ వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దీనిని మొదటగా ఫుడ్​ మార్కెట్, ట్రాఫిక్​ వ్యవస్థ, సేవారంగాలలో పనిచేసే సిబ్బందికి ఇవ్వనున్నారు. నెలరోజుల పాటు నిర్వహించిన చివరి దశ ట్రయల్స్​లో వ్యాక్సిన్​ సురక్షితమని నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : Aug 23, 2020, 11:35 AM IST

Updated : Aug 23, 2020, 11:43 AM IST

China approves use of COVID-19 vaccines: Report
చైనా వ్యాక్సిన్​ సక్సెస్​.. తక్షణమే వినియోగం

చైనా కరోనా వ్యాక్సిన్​ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు నిర్వహించిన మూడో దశ ట్రయల్స్​లో వ్యాక్సిన్​ సురక్షితమని తేలింది. దీనిని తక్షణమే ఉపయోగించేందుకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్​ను జులై 22 నుంచే వినియోగించేందుకు అనుమతి లభించిందని గ్లోబల్​ టైమ్స్ పేర్కొంది.

వైరస్​ను అరికట్టేందుకు మొదటగా ఈ వ్యాక్సిన్​ను ఫుడ్​ మార్కెట్, ట్రాఫిక్​ వ్యవస్థ, సేవారంగాలలో పనిచేసే వారికి ఇవ్వనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వైద్యశాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్​ ఝెంగ్​ జోంగ్​ వీ శనివారం ప్రకటించారు.

ధరెంత..?

వ్యాక్సిన్ ధర.. గతంలో చైనా ప్రభుత్వ ఔషధ సంస్థ సినోఫార్మా​ ప్రకటించిన దానికంటే తక్కువగానే ఉంటుందని జోంగ్ వీ తెలిపారు.

మూడో దశ ట్రయల్స్​లో భాగంగా వ్యాక్సిన్​ను యూఏఈలోని 20వేల మందిపై ప్రయోగించినట్లు సినోఫార్మా​ ఛైర్మన్​ యాంగ్ షియోమింగ్ వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించడానికి ముందే ఈ సంస్థ తమ సిబ్బందిపై జులైలో వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహించినట్లు తెలుస్తోంది.

చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ కూడా మరో వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను తయారు చేస్తోంది. ఇండోనేసియాలో 1600 మంది వలంటీర్లపై ఈ నెలలోనే ట్రయల్స్​ను ప్రారంభించింది.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు

చైనా కరోనా వ్యాక్సిన్​ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు నిర్వహించిన మూడో దశ ట్రయల్స్​లో వ్యాక్సిన్​ సురక్షితమని తేలింది. దీనిని తక్షణమే ఉపయోగించేందుకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్​ను జులై 22 నుంచే వినియోగించేందుకు అనుమతి లభించిందని గ్లోబల్​ టైమ్స్ పేర్కొంది.

వైరస్​ను అరికట్టేందుకు మొదటగా ఈ వ్యాక్సిన్​ను ఫుడ్​ మార్కెట్, ట్రాఫిక్​ వ్యవస్థ, సేవారంగాలలో పనిచేసే వారికి ఇవ్వనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వైద్యశాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్​ ఝెంగ్​ జోంగ్​ వీ శనివారం ప్రకటించారు.

ధరెంత..?

వ్యాక్సిన్ ధర.. గతంలో చైనా ప్రభుత్వ ఔషధ సంస్థ సినోఫార్మా​ ప్రకటించిన దానికంటే తక్కువగానే ఉంటుందని జోంగ్ వీ తెలిపారు.

మూడో దశ ట్రయల్స్​లో భాగంగా వ్యాక్సిన్​ను యూఏఈలోని 20వేల మందిపై ప్రయోగించినట్లు సినోఫార్మా​ ఛైర్మన్​ యాంగ్ షియోమింగ్ వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించడానికి ముందే ఈ సంస్థ తమ సిబ్బందిపై జులైలో వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహించినట్లు తెలుస్తోంది.

చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ కూడా మరో వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను తయారు చేస్తోంది. ఇండోనేసియాలో 1600 మంది వలంటీర్లపై ఈ నెలలోనే ట్రయల్స్​ను ప్రారంభించింది.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు

Last Updated : Aug 23, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.